ఈద్ సెలవుల్లో ఉల్లంఘనులపై ఉక్కుపాదం
- May 27, 2020
మస్కట్: ఒమన్ వ్యాప్తంగా ఈద్ సెలవుల నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాయల్ ఒమన్ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సుప్రీం కమిటీ డైరెక్షన్స్ని ప్రతి ఒక్కరూ పాటించాలనీ, ప్రత్యేక సందర్భాలను అనుసరించి కొన్ని వెసులుబాట్లు కల్పించిన దరిమిలా, వాటిని అడ్డం పెట్టుకుని ఉల్లంఘనలకు పాల్పడటం సబబు కాదని పోలీస్ అధికారులు అంటున్నారు. ఒమన్కి చెందిన 11 గవర్నరేట్స్ పరిధిలో మాస్క్లు ధరించనివారిపై చర్యలు తీసుకుంటున్నారు. కాగా, మస్కట్లో 40 మంది వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘలా ఇండస్ట్రియల్ ఏరియాలో సామూహిక ఈద్ ప్రార్థనలు నిర్వహించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. కాగా, మరో 34 మంది వలసదారుల్ని అల్ అన్సాబ్ ఏరియాలో అరెస్ట్ చేశారు. నార్త్ అల్ షర్కియాలోనూ, అల్ దఖ్లియాలోనూ ఇదే తరహాలో పెద్ద సంఖ్యలో వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తనిఖీలు విస్తృతంగా జరుగుతున్న దరిమిలా, ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని రాయల్ ఒమన్ పోలీస్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







