ఈద్ సెలవుల్లో ఉల్లంఘనులపై ఉక్కుపాదం
- May 27, 2020
మస్కట్: ఒమన్ వ్యాప్తంగా ఈద్ సెలవుల నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాయల్ ఒమన్ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సుప్రీం కమిటీ డైరెక్షన్స్ని ప్రతి ఒక్కరూ పాటించాలనీ, ప్రత్యేక సందర్భాలను అనుసరించి కొన్ని వెసులుబాట్లు కల్పించిన దరిమిలా, వాటిని అడ్డం పెట్టుకుని ఉల్లంఘనలకు పాల్పడటం సబబు కాదని పోలీస్ అధికారులు అంటున్నారు. ఒమన్కి చెందిన 11 గవర్నరేట్స్ పరిధిలో మాస్క్లు ధరించనివారిపై చర్యలు తీసుకుంటున్నారు. కాగా, మస్కట్లో 40 మంది వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘలా ఇండస్ట్రియల్ ఏరియాలో సామూహిక ఈద్ ప్రార్థనలు నిర్వహించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. కాగా, మరో 34 మంది వలసదారుల్ని అల్ అన్సాబ్ ఏరియాలో అరెస్ట్ చేశారు. నార్త్ అల్ షర్కియాలోనూ, అల్ దఖ్లియాలోనూ ఇదే తరహాలో పెద్ద సంఖ్యలో వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తనిఖీలు విస్తృతంగా జరుగుతున్న దరిమిలా, ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని రాయల్ ఒమన్ పోలీస్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







