టీ.20 మ్యాచ్‌లో లారా జట్టుపై సెహ్వాగ్‌ సేన గెలుపు

- January 30, 2016 , by Maagulf
టీ.20 మ్యాచ్‌లో లారా జట్టుపై సెహ్వాగ్‌ సేన గెలుపు

మాస్టర్స్‌ ఛాంపియన్స్‌ లీగ్‌లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో శనివారం జరిగిన టీ.20 మ్యాచ్‌లో బ్రియాన్‌ లారా సారథ్యంలోని లియో లయన్స్‌ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్‌ నేతృత్వంలోని జెమిని అరేబియన్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లియో లయన్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగా, జెమినీ అరేబియన్స్‌ 18 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సెహ్వాగ్‌ 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ కుమార సంగక్కర 41 పరుగులు, బ్రాడ్‌ హాగ్‌ 65 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com