కువైట్:ధరల నియంత్రణకు షాపులు, సూపర్ మార్కెట్లపై వాణిజ్య మంత్రిత్వ శాఖ నిఘా
- May 27, 2020
కువైట్:ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వినియోగదారుల హక్కులను రక్షించేందుకు కువైట్ పారిశ్రామిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. షాపులు, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలపై నిఘా పెంచింది. అలాగే 64 కోఆపరేటివీస్, 74 ఫుడ్ కేటరింగ్ ల సేవలను కూడా పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ వినియోగదారులకు సరుకుల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అంతేకాదు..ఫుడ్ డెలివరీ, సరుకుల సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం చేసిన ఉపేక్షించబోమని హెచ్చరించిన అధికారులు..డెలివరీ సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు ఎంతవరకు పాటిస్తున్నారో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు హాట్ లైన్ 135 ద్వారా 277 ఫిర్యాదులు అందాయని..ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రయోజనం పొందాలని దురాశపడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







