తెలంగాణ:కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు

- May 27, 2020 , by Maagulf
తెలంగాణ:కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో బుధవారం 107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2098 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 63కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో తెలంగాణ నుంచి 39 మంది, వలసకార్మికులకు 19 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో 49 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. . ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.తాజాగా 37 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1321 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 714 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com