రియాద్ : ప్రైవేట్ ఉద్యోగులు విధుల్లో చేరొచ్చని ప్రకటించిన సౌదీ ప్రభుత్వం

- May 28, 2020 , by Maagulf
రియాద్ : ప్రైవేట్ ఉద్యోగులు విధుల్లో చేరొచ్చని ప్రకటించిన సౌదీ ప్రభుత్వం

కరోనా వైరస్ సంక్షోభం తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తోంది సౌదీ అరేబియా ప్రభుత్వం. అందులో భాగంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇక నుంచి ఆఫీసులకు వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు సూచించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం నేటి నుంచే ప్రైవేట్ సంస్థలు తెరుచుకోనున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com