హైదరాబాద్ లో గుడిసెల్లో పేలిన గ్యాస్ సిలిండర్లు
- May 29, 2020
హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో వలస కూలీలు వేసుకున్న గుడిసెల్లోని ఓ గుడిసెలో ఈరోజు మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పేద కూలీల గుడిసెలు మొత్తం తగలబడ్డాయి. దీంతో మరో సిలిండర్ కూడా పేలింది. అసలే ఎండలు, దానికితోడు తీవ్రమైన వడగాలి ప్రభావానికి మంటలు చెలరేగాయి. రెండు సిలిండర్లు పేలిన సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అపార్ట్మెంట్ల మధ్య ఉన్న గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







