హైదరాబాద్ లో గుడిసెల్లో పేలిన గ్యాస్ సిలిండర్లు
- May 29, 2020
హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో వలస కూలీలు వేసుకున్న గుడిసెల్లోని ఓ గుడిసెలో ఈరోజు మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పేద కూలీల గుడిసెలు మొత్తం తగలబడ్డాయి. దీంతో మరో సిలిండర్ కూడా పేలింది. అసలే ఎండలు, దానికితోడు తీవ్రమైన వడగాలి ప్రభావానికి మంటలు చెలరేగాయి. రెండు సిలిండర్లు పేలిన సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అపార్ట్మెంట్ల మధ్య ఉన్న గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







