కువైట్:ఆదివారం నుంచి కూడా ఆన్ లైన్ లోనే బ్యాంక్ సర్వీసులు..
- May 30, 2020
కువైట్ సిటీ:కువైట్ లో బ్యాంక్ సేవల పునరుద్ధరణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. మే 31 నుంచి బ్యాంకు బ్రాంచులన్ని తెరుచుకుంటాయని ముందుగా అంతా భావించినా..ఆదివారం నుంచి కూడా బ్రాంచులు తెరుచుకోవటం లేదని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది. ఆదివారం నుంచి కూడా కస్టమర్లకు ఆన్ లైన్ లోనే సర్వీసులను అందించనున్నట్లు కూడా తెలిపింది. ఆర్ధిక లావాదేవీలన్ని ఆన్ లైన్ లోనే నిర్వహించుకోవలని కూడా అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. దేశీయంగా జరిపే లావాదేవీలతో పాటు, అంతర్జాతీయంగా జరిపే లావాదేవీలు కూడా ఆన్ లైన్ లోనే నిర్వహించాలని సూచించింది. డబ్బులను ఎటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలని..అలాగే ఏదైనా ఫిర్యాదులు చేయాలంటే కస్టమర్స్ సర్వీస్ కు ఫోన్ చేయాలని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ వినియోగదారులకు సూచించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







