ఒమన్:భారీ వర్షాలతో ఒకరు మృతి..మరొకరు గల్లంతు
- May 30, 2020
ఒమన్:ఒమన్ లో భారీ వర్షాలు కురియటంతో ఒకరు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. దోఫర్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షాల కారణంగా ఎయిన్ రజాత్ లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతైన మరో వ్యక్తి కోసం రాయల్ ఒమన్ పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. సివిల్ డిఫెన్స్ కు చెందిన పబ్లిక్ అథారిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నీటి ప్రవాహంలో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. అయితే..అందులోఐదుగురిని రక్షించగా..మరో ఇద్దరు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఓ వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. మరో వ్యక్తి ఆచూకీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







