అమృతం
- January 30, 2016
కలిసే మొదలయ్యింది పయనం
నీళ్ళల్లో చేపల్లా ఈది
మబ్బుల్లో గువ్వల్లా యెగిరి
ఎండ తర్వాత వాన
వాన తర్వాత చలి
ఏ కాలం
ఎవరు పిలిస్తే వచ్చిందో అడగనేలేదు
ఆరిపోని చీకటి బాధనీ
జాడ తెలియని వేకువ గాధనీ
ఆరా తీయనేలేదు
కొమ్మను వీడి
రాలిపడుతున్న ఎండుటాకులా ఒకరం
మట్టిని చీల్చుకొని
పుడుతున్న లేత మొలకలా ఇంకొకరం
రుతువేదో మారినప్పుడు
దూరమెందుకవు తామో తెలియనేలేదు
చినుకుమీద మట్టికున్నంత ప్రేమ
మనకూ వున్నందుకు
దుఃఖ మంతా కవిత్వమేనని తెలిసింది
--పారువెల్ల(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







