అమృతం
- January 30, 2016కలిసే మొదలయ్యింది పయనం
నీళ్ళల్లో చేపల్లా ఈది
మబ్బుల్లో గువ్వల్లా యెగిరి
ఎండ తర్వాత వాన
వాన తర్వాత చలి
ఏ కాలం
ఎవరు పిలిస్తే వచ్చిందో అడగనేలేదు
ఆరిపోని చీకటి బాధనీ
జాడ తెలియని వేకువ గాధనీ
ఆరా తీయనేలేదు
కొమ్మను వీడి
రాలిపడుతున్న ఎండుటాకులా ఒకరం
మట్టిని చీల్చుకొని
పుడుతున్న లేత మొలకలా ఇంకొకరం
రుతువేదో మారినప్పుడు
దూరమెందుకవు తామో తెలియనేలేదు
చినుకుమీద మట్టికున్నంత ప్రేమ
మనకూ వున్నందుకు
దుఃఖ మంతా కవిత్వమేనని తెలిసింది
--పారువెల్ల(దుబాయ్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు