తెలంగాణలో 6 కరోనా మరణాలు

- June 01, 2020 , by Maagulf
తెలంగాణలో 6 కరోనా మరణాలు

హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 94 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా,మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరింది.ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.మొత్తం కరోనా కేసుల్లో 432 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 1491 మంది కరోనా నుంచి కోలుకోగా, 88 మంది మరణించారు. 1,213 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 

తాజాగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 79, రంగారెడ్డి జిల్లాలో 3, మహబూబాబాద్‌ జిల్లాలో 1, మేడ్చల్‌ జిల్లాలో 3, మెదక్‌ జిల్లాలో 2, పెద్దపల్లి జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, జనగాం జిల్లాలో 1 ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com