కోవిడ్-19 పై పోరాటం: యూఏఈ చేరుకోనున్న 172 మంది నర్సులు
- June 02, 2020దుబాయ్: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక ‘ఫ్లై దుబాయ్’ విమానం లో 172 మంది నర్సులను దుబాయ్ కు తీసుకురానున్నారు. వీరంతా కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోని ఆస్టర్ డిఎం హెల్త్కేర్ ఆసుపత్రుల నుండి ఎంపిక చేయబడినవారు. వీరందరిని మొదటి రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచిన తరువాత వారిని వివిధ ఆసుపత్రులకు కేటాయించనున్నారు.
ఈ వైద్య బృందం యూఏఈ కి ప్రయాణించటానికి MEA (విదేశాంగ మంత్రిత్వ శాఖ) తమ అనుమతి ఇవ్వడంతోపాటు అన్ని లాంఛనాలు పూర్తిచేసుకొని నేడు బయలుదేరుటకు సిద్ధంగా ఉంది అని ఇండియా లోని యూఏఈ రాయబార కార్యాలయం తెలిపింది.
దుబాయ్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హుమైద్ అల్ కుతామి మాట్లాడుతూ, " ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. సమాజానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఫ్రంట్లైన్ కార్మికులకు మా కృతజ్ఞతలు" అని అన్నారు.
కాగా, కరోనావైరస్ పై పోరాటంలో తమవంతు సాయం అందించేందుకు మే నెలలో 88 మంది వైద్యులు మరియు నర్సులను యూఏఈ కి రావటం జరిగింది. అంతేకాకుండా, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి భారతదేశం ఇంతకుముందు 15 మంది గల వైద్య బృందాన్ని కువైట్ కు పంపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ