'దండకారణ్యం' త్వరలో..

- January 31, 2016 , by Maagulf
'దండకారణ్యం'  త్వరలో..

ఆ ర్‌.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన చిత్రం 'దండకారణ్యం'. త్రినాథ్‌, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్‌ ప్రధాన పాత్రధారులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నారాయణమూర్తి మాట్లాడుతూ ''త్రేతాయుగంలో సీతారాములకు, ద్వాపర యుగంలో పాండవులకు స్థావరం కల్పించింది దండకారణ్యమే.అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకొంది. బాక్సైట్‌ తవ్వకాలతో అక్కడున్న ఆదివాసీలకు మనుగడ లేకుండాపోతోంది. ఆ విషయాల్ని మా సినిమాతో తెరపై ఆవిష్కరించాం. మొత్తం ఏడు పాటల్లో మూడింటిని గద్దర్‌ ఆలపించారు. బొబ్బిలి, అరకు, విజయనగరం, పాల్వంచ, పాపికొండల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. ఛాయాగ్రహణం: శివకుమార్‌, సాహిత్యం: గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి, కాశీపతి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com