కువైట్:ఉద్యోగుల జీతాలపై కరోనా ఎఫెక్ట్...50%కోతకు తాత్కాలిక ముసాయిదా చట్టం
- June 02, 2020కువైట్:కరోనా సంక్షోభ ప్రభావం ప్రైవేట్ ఉద్యోగులపై పడింది. ఉద్యోగుల జీతాల నుంచి 50 శాతం కోత విధించేందుకు అవకాశం ఇస్తూ కువైట్ ప్రభుత్వం తాత్కాలిక ముసాయిదా చట్టం తీసుకువస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీకి ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిఫార్సు చేసింది. ముసాయిదా చట్టాన్ని మంత్రి మండలి ఆమోదించిన తర్వాత.. డ్రాఫ్ట్ నెం. 2020/86 మేరకు కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలకు ఊరట లభించనుంది. సంక్షోభం నుంచి తేరుకునే వరకు ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించేలా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఒప్పందం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. అయితే..ఈ ముసాయిదా చట్టం తాత్కాలిక సమయం వరకు మాత్రమే అమలులో ఉంటుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ యధావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..