రియాద్:పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేటర్స్ గా 156 మంది మహిళలు, పురుషుల నియామకం

- June 02, 2020 , by Maagulf
రియాద్:పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేటర్స్ గా 156 మంది మహిళలు, పురుషుల నియామకం

రియాద్:ప్రజా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరిచేలా, పౌరులకు సరైన న్యాయం జరిగేలా సౌదీ ప్రభుత్వం న్యాయశాఖను మరింత పటిష్టం చేస్తోంది. ఇందుకోసం కొత్తగా 156 మంది పురుషులు, మహిళలను ఇన్వెస్టిగేటీవ్ లెఫ్టినెంట్ హోదాతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమించింది. ఈ మేరకు రాజు సల్మాన్ రాజ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకాలు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ సౌద్ అల్ ముజీబ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు న్యాయవ్యవస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు సేవ చేసేలా మహిళలకు ప్రధాన్యం దక్కుతుందని కూడా ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com