యూఏఈలో కారావ్యాన్లను కూరగాయల దుకాణంగా మార్చిన ఇద్దరికి భారీ జరిమానా

- June 02, 2020 , by Maagulf
యూఏఈలో  కారావ్యాన్లను కూరగాయల దుకాణంగా మార్చిన ఇద్దరికి భారీ జరిమానా

యూఏఈ:ప్రజారోగ్య నిబంధనలు ఉల్లంఘించి కారావ్యాన్ల లను కూరగాయల దుకాణాలు మార్చిన ఇద్దరికి భారీ జరిమానా విధించారు. రస్ అల్ ఖైమా మున్సిపాలిటి పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. కారావ్యాన్ వాహనాలనే కూరగాయలు, కిరాణా స్టోర్స్ మార్చినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూరగాయలు, పండ్లు, కిరాణా స్టోర్స్ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఇన్స్ పెక్టర్ల టీం వెంటనే స్పాట్ కు చేరుకొని..స్టోర్స్ ను పరిశీలించింది. ఆహార నిల్వకు పాటించాల్సిన నిబంధనలేవి పాటించలేదని, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రమాదకరమని భావించిన అధికారులు దుకాణ నిర్వాహకులకు భారీ జరిమానా విధించారు. కూరగాయలు, పళ్లు, కిరాణా వస్తువులను జప్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నిబంధనల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com