యూఏఈలో కారావ్యాన్లను కూరగాయల దుకాణంగా మార్చిన ఇద్దరికి భారీ జరిమానా
- June 02, 2020యూఏఈ:ప్రజారోగ్య నిబంధనలు ఉల్లంఘించి కారావ్యాన్ల లను కూరగాయల దుకాణాలు మార్చిన ఇద్దరికి భారీ జరిమానా విధించారు. రస్ అల్ ఖైమా మున్సిపాలిటి పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. కారావ్యాన్ వాహనాలనే కూరగాయలు, కిరాణా స్టోర్స్ మార్చినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూరగాయలు, పండ్లు, కిరాణా స్టోర్స్ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఇన్స్ పెక్టర్ల టీం వెంటనే స్పాట్ కు చేరుకొని..స్టోర్స్ ను పరిశీలించింది. ఆహార నిల్వకు పాటించాల్సిన నిబంధనలేవి పాటించలేదని, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రమాదకరమని భావించిన అధికారులు దుకాణ నిర్వాహకులకు భారీ జరిమానా విధించారు. కూరగాయలు, పళ్లు, కిరాణా వస్తువులను జప్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నిబంధనల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్