యూఏఈలో కారావ్యాన్లను కూరగాయల దుకాణంగా మార్చిన ఇద్దరికి భారీ జరిమానా
- June 02, 2020
యూఏఈ:ప్రజారోగ్య నిబంధనలు ఉల్లంఘించి కారావ్యాన్ల లను కూరగాయల దుకాణాలు మార్చిన ఇద్దరికి భారీ జరిమానా విధించారు. రస్ అల్ ఖైమా మున్సిపాలిటి పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. కారావ్యాన్ వాహనాలనే కూరగాయలు, కిరాణా స్టోర్స్ మార్చినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూరగాయలు, పండ్లు, కిరాణా స్టోర్స్ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఇన్స్ పెక్టర్ల టీం వెంటనే స్పాట్ కు చేరుకొని..స్టోర్స్ ను పరిశీలించింది. ఆహార నిల్వకు పాటించాల్సిన నిబంధనలేవి పాటించలేదని, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రమాదకరమని భావించిన అధికారులు దుకాణ నిర్వాహకులకు భారీ జరిమానా విధించారు. కూరగాయలు, పళ్లు, కిరాణా వస్తువులను జప్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నిబంధనల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







