యూఏఈలో కారావ్యాన్లను కూరగాయల దుకాణంగా మార్చిన ఇద్దరికి భారీ జరిమానా
- June 02, 2020యూఏఈ:ప్రజారోగ్య నిబంధనలు ఉల్లంఘించి కారావ్యాన్ల లను కూరగాయల దుకాణాలు మార్చిన ఇద్దరికి భారీ జరిమానా విధించారు. రస్ అల్ ఖైమా మున్సిపాలిటి పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. కారావ్యాన్ వాహనాలనే కూరగాయలు, కిరాణా స్టోర్స్ మార్చినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూరగాయలు, పండ్లు, కిరాణా స్టోర్స్ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఇన్స్ పెక్టర్ల టీం వెంటనే స్పాట్ కు చేరుకొని..స్టోర్స్ ను పరిశీలించింది. ఆహార నిల్వకు పాటించాల్సిన నిబంధనలేవి పాటించలేదని, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రమాదకరమని భావించిన అధికారులు దుకాణ నిర్వాహకులకు భారీ జరిమానా విధించారు. కూరగాయలు, పళ్లు, కిరాణా వస్తువులను జప్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నిబంధనల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్