కువైట్:ఉద్యోగుల జీతాలపై కరోనా ఎఫెక్ట్...50%కోతకు తాత్కాలిక ముసాయిదా చట్టం

- June 02, 2020 , by Maagulf
కువైట్:ఉద్యోగుల జీతాలపై కరోనా ఎఫెక్ట్...50%కోతకు తాత్కాలిక ముసాయిదా చట్టం

కువైట్:కరోనా సంక్షోభ ప్రభావం ప్రైవేట్ ఉద్యోగులపై పడింది. ఉద్యోగుల జీతాల నుంచి 50 శాతం కోత విధించేందుకు అవకాశం ఇస్తూ కువైట్ ప్రభుత్వం తాత్కాలిక ముసాయిదా చట్టం తీసుకువస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీకి ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిఫార్సు చేసింది. ముసాయిదా చట్టాన్ని మంత్రి మండలి ఆమోదించిన తర్వాత.. డ్రాఫ్ట్ నెం. 2020/86 మేరకు కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలకు ఊరట లభించనుంది. సంక్షోభం నుంచి తేరుకునే వరకు ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించేలా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఒప్పందం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. అయితే..ఈ ముసాయిదా చట్టం తాత్కాలిక సమయం వరకు మాత్రమే అమలులో ఉంటుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ యధావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com