కువైట్:ఉద్యోగుల జీతాలపై కరోనా ఎఫెక్ట్...50%కోతకు తాత్కాలిక ముసాయిదా చట్టం
- June 02, 2020కువైట్:కరోనా సంక్షోభ ప్రభావం ప్రైవేట్ ఉద్యోగులపై పడింది. ఉద్యోగుల జీతాల నుంచి 50 శాతం కోత విధించేందుకు అవకాశం ఇస్తూ కువైట్ ప్రభుత్వం తాత్కాలిక ముసాయిదా చట్టం తీసుకువస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీకి ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిఫార్సు చేసింది. ముసాయిదా చట్టాన్ని మంత్రి మండలి ఆమోదించిన తర్వాత.. డ్రాఫ్ట్ నెం. 2020/86 మేరకు కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలకు ఊరట లభించనుంది. సంక్షోభం నుంచి తేరుకునే వరకు ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించేలా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఒప్పందం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. అయితే..ఈ ముసాయిదా చట్టం తాత్కాలిక సమయం వరకు మాత్రమే అమలులో ఉంటుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ యధావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు