కువైట్:ఉద్యోగుల జీతాలపై కరోనా ఎఫెక్ట్...50%కోతకు తాత్కాలిక ముసాయిదా చట్టం
- June 02, 2020
కువైట్:కరోనా సంక్షోభ ప్రభావం ప్రైవేట్ ఉద్యోగులపై పడింది. ఉద్యోగుల జీతాల నుంచి 50 శాతం కోత విధించేందుకు అవకాశం ఇస్తూ కువైట్ ప్రభుత్వం తాత్కాలిక ముసాయిదా చట్టం తీసుకువస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీకి ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిఫార్సు చేసింది. ముసాయిదా చట్టాన్ని మంత్రి మండలి ఆమోదించిన తర్వాత.. డ్రాఫ్ట్ నెం. 2020/86 మేరకు కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలకు ఊరట లభించనుంది. సంక్షోభం నుంచి తేరుకునే వరకు ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించేలా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఒప్పందం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. అయితే..ఈ ముసాయిదా చట్టం తాత్కాలిక సమయం వరకు మాత్రమే అమలులో ఉంటుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ యధావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







