వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్‌ పార్కు లు..

- January 31, 2016 , by Maagulf
వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్‌ పార్కు లు..

వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు యాడ్‌లాబ్స్‌ ఇమాజికా తెలిపింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందర్నీ ఆకర్షించేలా.. డిస్నీ వరల్డ్‌ తరహాలో యాడ్‌లాబ్స్‌ భారత్‌లో థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2013లో ముంబయి - పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ పార్కు ఉంది. అయితే ఇటీవల కాలంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో భారత్‌లో మరో రెండు పార్కులను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఉత్తర, దక్షిణ భారత్‌లో వీటిని ఏర్పాటు చేస్తామని యాడ్‌లాబ్స్‌ సీఈవో, డైరెక్టర్‌ కపిల్‌ బగ్లా తెలిపారు. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఒకటి, హైదరాబాద్‌ లేదా బెంగళూరులో ఒక థీమ్‌ పార్కును నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అంతేగాక.. ప్రస్తుతమున్న పార్కులోనూ మరిన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com