వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్ పార్కు లు..
- January 31, 2016
వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు యాడ్లాబ్స్ ఇమాజికా తెలిపింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందర్నీ ఆకర్షించేలా.. డిస్నీ వరల్డ్ తరహాలో యాడ్లాబ్స్ భారత్లో థీమ్పార్క్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2013లో ముంబయి - పుణె ఎక్స్ప్రెస్వేలో ఈ పార్కు ఉంది. అయితే ఇటీవల కాలంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో భారత్లో మరో రెండు పార్కులను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఉత్తర, దక్షిణ భారత్లో వీటిని ఏర్పాటు చేస్తామని యాడ్లాబ్స్ సీఈవో, డైరెక్టర్ కపిల్ బగ్లా తెలిపారు. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఒకటి, హైదరాబాద్ లేదా బెంగళూరులో ఒక థీమ్ పార్కును నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అంతేగాక.. ప్రస్తుతమున్న పార్కులోనూ మరిన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







