కేరళ ఏనుగు మృతి కేసులో వ్యక్తి అరెస్ట్
- June 05, 2020
తిరువనంతపురం:కేరళలోని పాలక్కాడ్ జిల్లా సరిహద్దుల్లో పేలుడు పదార్థాలున్న ఫైనాపిల్ పండును తిని గాయాలపాలై ఇటీవల మరణించిన గర్భిణీ ఏనుగు ఘటనపై సర్వ త్రా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. పౌరసమాజం తోపాటు సోషల్ మీడియాలో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కేరళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
అయితే గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు కేరళ అటవీ శాఖ మంత్రి కె.రాజు తెలిపారు. ఈ ఘటనలో మరికొంతమంది పాల్గొన్నారని, మిగతావారిని కూడా పట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ దర్యాప్తు జరుపుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. కాగా సైలెంట్ వ్యాలీ ఫారెస్ట్లో శక్తివంతమైన ఫైర్ క్రాకర్స్తో నిండిన పైనాపిల్ను 15 ఏళ్ల ఏనుగు తినడంతో ఇది ఒక వారం తరువాత వెల్లియార్ నదిలో మరణించింది.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







