పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని కలిసిన APNRTS టీం

- June 05, 2020 , by Maagulf
పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని కలిసిన  APNRTS టీం

తిరుపతి:రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ని ఈ రోజు తిరుపతి లో APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో టీం కలవడం జరిగింది. 

కువైట్ లో అమ్నెష్టి క్షమాభిక్ష కారణంగా షెల్టర్ లలో వున్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అలాగే గల్ఫ్ దేశాలలో వున్న ప్రవాసాంధ్రులను కూడా  త్వరగా ఆంధ్రప్రదేశ్ కు రప్పించే ప్రయత్నం చేయాలని మిధున్ రెడ్డి కి బి.హెచ్ ఇలియాస్ విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా వలసకార్మీకులను తరలింపు చేసేందుకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎపిఎన్ఆర్టిస్ కోఆర్డినేటర్స్  మర్రి కల్యాణ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, షేక్ నాసర్ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com