కువైట్ కు కరోనా వ్యాక్సిన్ ఎవిగన్..వచ్చేవారం సరఫరా చేయనున్న జపాన్
- June 06, 2020
కువైట్ సిటీ:కరోనా డ్రగ్స్ 'ఎవిగన్' ను కువైట్ కు సరఫరా చేయనుంది జపాన్. వచ్చే వారంలో కరోనా డ్రగ్స్ తమ దేశానికి చేరుకుంటాయని కువైట్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు దేశాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో జపాన్ నుంచి ఎవిగన్ ను దిగుమతి చేసుకుంటామని కూడా తెలిపింది. అయితే..మాత్రల సరఫరా వాణిజ్య విలువలకు లోబడి కాకుండా కేవలం మానవతాధృక్పథంతో జపాన్ ఎవిగన్ ను సరఫరా చేస్తోందని కూడా మంత్రిత్వశాఖ వివరించింది. జపాన్ రూపొందించిన మార్గనిర్దేశకాలు, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు మెడిసిన్ ను వినియోగించనున్నారు. జపాన్ నుంచి మెడిసిన్ దిగుమతి చేసుకునేలా విశేషంగా కృషి చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు టోక్యోలోని కువైట్ రాయాబార కార్యాలయ అధికారుల సేవలను ఈ సందర్భంగా కువైట్ ప్రభుత్వం ప్రశంసించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







