తెలంగాణలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు

- June 05, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 143 కరోనా  పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన గంటల్లో  కొత్తగా 143 కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. తాజా కేసుల్లో GHMC పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌ 5, వరంగల్‌ 3, ఆదిలాబాద్‌, మేడ్చల్‌, ఖమ్మం, సంగారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో 8 మంది మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 113కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 40 మంది కోలుకోగా మొత్తం కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1627కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1550 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com