తెలంగాణలో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు
- June 05, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన గంటల్లో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. తాజా కేసుల్లో GHMC పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్నగర్ 5, వరంగల్ 3, ఆదిలాబాద్, మేడ్చల్, ఖమ్మం, సంగారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్తో 8 మంది మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 113కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 40 మంది కోలుకోగా మొత్తం కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1627కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1550 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







