11 వేల మంది ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సౌదీ న్యాయస్థానాలు
- June 06, 2020
రియాద్:గత కొద్ది రోజులుగా సౌదీ అరేబియాలో అమలు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్ విచారణ విజయవంతంగా అమలు అవుతోంది. సౌదీ అరేబియాలోని పలు గవర్నరేట్ పరిధిలో దాదాపు 11,052 మంది ఖైదీలను విచారించాయి న్యాయస్థానాలు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కోర్టులకు ఖైదీలను తరలించేందుకు బదులుగా జైలు నుంచే రిమోట్ సిస్టం ద్వారా గత కొద్ది రోజులుగా విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఖైదీలను జైలు నుంచి కోర్టులకు తరలించే సమయాన్ని, ఖర్చును కూడా ఆదా చేయగలుతున్నట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ గవర్నరేట్ పరిధిలోని జైళ్లలో వీడియో కాన్ఫరెన్స్ కు అవసరమైన సాంకేతికను సిద్ధం చేశామని, అలాగే భాషపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టాన్స్ లేటర్ వ్యవస్థను కూడా సాంకేతికకు జతచేసినట్లు వెల్లడించారు. ఖైదీలు వేలిముద్రల ద్వారా వారికి సంబంధించి వివరాలు కోర్టుకు చేరుతాయని కూడా వివరించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







