11 వేల మంది ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సౌదీ న్యాయస్థానాలు

- June 06, 2020 , by Maagulf
11 వేల మంది ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సౌదీ న్యాయస్థానాలు

రియాద్:గత కొద్ది రోజులుగా సౌదీ అరేబియాలో అమలు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్ విచారణ విజయవంతంగా అమలు అవుతోంది. సౌదీ అరేబియాలోని పలు గవర్నరేట్ పరిధిలో దాదాపు 11,052 మంది ఖైదీలను విచారించాయి న్యాయస్థానాలు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కోర్టులకు ఖైదీలను తరలించేందుకు బదులుగా జైలు నుంచే రిమోట్ సిస్టం ద్వారా గత కొద్ది రోజులుగా విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఖైదీలను జైలు నుంచి కోర్టులకు తరలించే సమయాన్ని, ఖర్చును కూడా ఆదా చేయగలుతున్నట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ గవర్నరేట్ పరిధిలోని జైళ్లలో వీడియో కాన్ఫరెన్స్ కు అవసరమైన సాంకేతికను సిద్ధం చేశామని, అలాగే భాషపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టాన్స్ లేటర్ వ్యవస్థను కూడా సాంకేతికకు జతచేసినట్లు వెల్లడించారు. ఖైదీలు వేలిముద్రల ద్వారా వారికి సంబంధించి వివరాలు కోర్టుకు చేరుతాయని కూడా వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com