భారత్‌లో కరోనా ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేసిన WHO ప్రతినిధులు

- June 06, 2020 , by Maagulf
భారత్‌లో కరోనా ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేసిన WHO ప్రతినిధులు

జెనీవా:ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధులు భారత్ లో కరోనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రియాన్ స్పందించారు. ఇప్పటి వరకూ పెద్దగా సమస్య లేకపోయినప్పటికీ.. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత భారత్ లో కరోనా విజృంభిస్తుందని అన్నారు. మూడు వారాల్లో కేసులు రెట్టింపవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి తీరు అతిగా లేకపోయినప్పటికీ.. కేసుల పెరుగుతున్న విషయం స్పష్టంగా తెలస్తుందని అన్నారు. భారత్ లో అన్నిప్రాంతాలలో ఒకేలా లేదని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేర్వేరుగా ఉందని మైఖేల్ రియాన్ అన్నారు.

అటు, కరోనా సంక్షోభాన్ని భారత్ ఓ అవకాశంగా మార్చుకోవచ్చిని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ గెబ్రేయిన్ అన్నారు. దీన్ని అవకాశంగా మలుచుకొని ఆయూష్మాన్ భారత్ పథకాన్ని మరింత పటిష్టపరచవచ్చని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com