మస్కట్:పర్వత శిఖిరంపై నుంచి పడిన వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్

- June 06, 2020 , by Maagulf
మస్కట్:పర్వత శిఖిరంపై నుంచి పడిన వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్

మస్కట్:పర్వత శిఖరంపై నుంచి కింద పడిన వారిని రక్షించేందుకు రాయల్ ఒమన్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సమైల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒమన్ కు చెందిన కొందరు పౌరులు స్థానిక పర్వతాన్ని అధిరోహించారు. అయితే..ప్రమాదవశాత్తు పర్వత అంచు నుంచి కింద పడిపోయారు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీసులు వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బాధితులను ఖవ్లా ఆస్పత్రిలో చేర్పించారు. పర్వతాలను అధిరోహించే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలకి సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com