సౌదీ అరేబియా నుంచి ఎన్ఆర్ఐలను భారత్ తరలించనున్న గల్ఫ్ ఎయిర్
- June 07, 2020
మనామా:సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను ఇండియా తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ లో గల్ఫ్ ఎయిర్ కూడా భాగస్వామ్యం కానుంది. ఈ మేరకు బహ్రెయిన్ కు చెందిన గల్ఫ్ ఎయిర్ ప్రతినిధులు..సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్ లోని చెన్నై, అహ్మదాబాద్, మంగళూరు, కొచ్చి విమానాశ్రయాలకు గల్ఫ్ ఎయిర్ సంస్థ తమ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. కరోనా సంక్షోభంలోనూ ఇప్పటికీ సేవలను అందిస్తున్న అతికొద్ది సంస్థల్లో గల్ఫ్ ఎయిర్ ఒకటి. వివిధ దేశాల్లోని పౌరులను, సరుకు రవాణాను చేరవేసేందుకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఇటీవలె లాహోర్ నుంచి రియాద్ కు 50 టన్నుల మాంసాన్ని కార్గో ఫ్లైట్ లో తరలించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







