మనామా:BD2,000 చోరీ..24 గంటల్లోనే ముగ్గురు నేరగాళ్ల అరెస్ట్

- June 07, 2020 , by Maagulf
మనామా:BD2,000 చోరీ..24 గంటల్లోనే ముగ్గురు నేరగాళ్ల అరెస్ట్

మనామా:BD2,000 చోరికి పాల్పడిన కేసును 24 గంటల్లో పరిష్కరించారు బహ్రెయిన్ పోలీసులు. బహ్రెయిన్ లోని అసియా దేశాలకు చెందిన ఓ ప్రవాసీయుడి దగ్గర్నుంచి ముగ్గురు వ్యక్తులు BD2,000 దొంగిలించారు. ఈ ముగ్గురిలో ఒకరు అసియా దేశాలకు చెందిన వ్యక్తికాగ..మిగిలిన ఇద్దరిలో ఒకరు బహ్రెయిన్, మరొకరు అరబ్ దేశాలకు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. చోరీ జరిగినట్లు తమకు ఫిర్యాదు అందిన వెంటనే విచారణ ప్రారంభించామని, కేవలం 24 గంటల్లోనే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామని బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. చోరీ సొత్తును సీజ్ చేశామని, ముగ్గురు నిందితులను న్యాయ విచారణకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com