జనవరి 2021 నుంచి వలసదారులకు ఎంప్లాయర్ని మార్చుకునే వీలు
- June 08, 2020
ఒమాన్: జనవరి 21 నుంచి వలసదారులు, తమ ఎంప్లాయర్ని మార్చుకునే వీలు కలుగుతుంది. అయితే, కొన్ని షరతులను/నిబంధనలను వలసదారులు పూర్తి చేయాల్సి వుంటుంది. పోలీస్ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహ్సెన్ అల్ షారికి మాట్లాడుతూ ఎగ్జుక్యూటివ్ రెగ్యులేషన్స్ - రెసిడెన్స్ అండ్ ఫారినర్స్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు చేసినట్టు వెల్లడించారు. వలసదారులు తమ రెసిడెంట్ వీసాని ఒక ఎంప్లాయర్ నుంచి మరో ఎంప్లాయర్కి మార్చుకోవచ్చు. ఆధారాలతో సహా కాంట్రాక్టు గడువు/ కాంట్రాక్టు రద్దు ని నిరూపించాల్సి వుంటుంది. జనవరి 2021 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అవసరమైన అన్ని నిబంధనలను పాటించినప్పుడు, వలసదారు రెసిడెన్స్కి సంబంధించి మొదటి ఎంప్లాయర్ బాధ్యత చెల్లుబాటవుతుంది. ప్రస్తుతం వున్న విధానం ప్రకారం 'ఎన్ఓసి'ని సమర్పిస్తే ఓ కంపెనీ నుంచి మరో కంపెనీలోకి వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. లేదంటే, ఒమన్ ని విడిచి వెళ్ళి, రెండేళ్ల తర్వాత రావాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







