ఏపీలో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు

- June 08, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఏపీలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 14,246 మందికి పరీక్షలు నిర్వహించగా 125 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4813 కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 838 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉండగా, 132 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 34 మందిని కొత్తగా డిశ్చార్జి చేయడంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2387కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1381 గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో ఎవరూ చనిపోలేదు. రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ మరణాల సంఖ్య 75. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com