ఒక్క కరోనా కేసూ లేదు.. సంతోషంతో డ్యాన్స్ చేసిన ప్రధాని
- June 08, 2020
50 లక్షల జనాభా.. అయినా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కరోనాని సమర్ధవంతంగా ఎదుర్కొంది. గత 17 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోవడంతో లాక్డౌన్ ఎత్తివేసింది న్యూజిలాండ్ దేశం. ప్రధాని జసిండా అర్డర్న్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ న్యూజిలాండ్ ను కరోనా ఫ్రీ దేశంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. హ్యాపీగా ఎంతమందైనా కలిసి తిరిగేయండి.. భౌతిక దూరాన్ని అస్సలు పాటించక్కర్లేదని చెప్పారు. అయితే దేశ సరిహద్దుల వద్ద మాత్రం ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఆమె అన్నారు.
కాగా, ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు 1154, మరణించిన వారి సంఖ్య 22. కేసులు లేవని తెలిసిన వెంటనే ప్రధాని తన ఛాంబర్ లో డ్యాన్స్ చేశారని మీడియా పేర్కొంది. కరోనాని విజయవంతంగా ఎదుర్కున్న న్యూజీల్యాండ్ లో ఇక నుంచి నైట్ క్లబ్ లు, థియేటర్లు తెరుచుకుంటాయి. క్రీడా ప్రాంగణాలు కూడా పరిమితులకు లోబడి తెరుచుకుంటాయి. విస్తృత స్థాయిలో, ప్రధాని ఆంక్షలను సడలించడం న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుందని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ఆర్థిక పురోగతి వైపు దృష్టి సారిస్తామని ప్రధాని చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







