ఒమన్:ఇవాళ్టి నుంచి దోఫర్ గవర్నరేట్ పరిధిలో చెక్ పాయింట్స్ ఏర్పాటు
- June 13, 2020
మస్కట్:కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది ఒమన్ ప్రభుత్వం. అనవసర ప్రయాణాలను తగ్గించేందుకు ఎక్కడిక్కడ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా దోఫర్ గవర్నరేట్ పరిధిలో ఇవాళ్టి నుంచి తనఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దోఫర్ పరిధిలోని మసిర, జబల్ అల్ అక్ధర్, జబల్ షామ్స్ ప్రాంతాల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని, పౌరులు, ప్రవాసీయులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది. ఈ రోజుల మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చే నెల 3వ తేది వరకు తనఖీ కేంద్రాలు కొనసాగుతాయని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







