బహ్రెయిన్:దాడి చేసి దోపిడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- June 13, 2020
మనామా:అసియాకు చెందిన ఓ వ్యక్తిపై దౌర్జన్యంగా దాడి చేసి అతని వస్తువులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరి వయసు 46 ఏళ్లు, మరొకరు 30 ఏళ్లు ఉంటారని వివరించారు. ఈ ఘటన బహ్రెయిన్ లోని ఇసా పట్టణంలో చోటు చేసుకుంది. దాడికి చేసి దోపిడికి పాల్పడిన వీడియో వైరల్ గా మారిన కొద్ది గంటల్లోనే దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే..ఇద్దరి దోపిడి, దాడి కేసులను నమోదు చేశామని, ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నారని నేరానికి సంబంధించి ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ప్రకారం 29 ఏళ్ల అసియా దేశాలకు చెందిన వ్యక్తిని అడ్డుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు దాడి చేసి అతని దగ్గరున్న వస్తువులను లాక్కున్నాడు. మరో వ్యక్తి అటు వెళ్తున్న వారెవరు అతనికి సాయంగా రాకుండా బెదిరిస్తూ అడ్డుకున్నట్లు స్పష్టం అవుతోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







