బహ్రెయిన్:దాడి చేసి దోపిడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- June 13, 2020
మనామా:అసియాకు చెందిన ఓ వ్యక్తిపై దౌర్జన్యంగా దాడి చేసి అతని వస్తువులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరి వయసు 46 ఏళ్లు, మరొకరు 30 ఏళ్లు ఉంటారని వివరించారు. ఈ ఘటన బహ్రెయిన్ లోని ఇసా పట్టణంలో చోటు చేసుకుంది. దాడికి చేసి దోపిడికి పాల్పడిన వీడియో వైరల్ గా మారిన కొద్ది గంటల్లోనే దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే..ఇద్దరి దోపిడి, దాడి కేసులను నమోదు చేశామని, ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నారని నేరానికి సంబంధించి ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ప్రకారం 29 ఏళ్ల అసియా దేశాలకు చెందిన వ్యక్తిని అడ్డుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు దాడి చేసి అతని దగ్గరున్న వస్తువులను లాక్కున్నాడు. మరో వ్యక్తి అటు వెళ్తున్న వారెవరు అతనికి సాయంగా రాకుండా బెదిరిస్తూ అడ్డుకున్నట్లు స్పష్టం అవుతోంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







