కరోనా పై సర్వే చెప్తున్న షాకింగ్ విషయాలు
- June 14, 2020
కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. కరోనా వైరస్ ను తట్టుకొని నిలబడాలి అంటే తప్పనిసరిగా వ్యాధినిరోధక శక్తి కలిగి ఉండాలి. కరోనా వైరస్ దేశంలోని 82 జిల్లాల్లో వ్యాపించింది. ఈ 82 జిల్లాల్లో ఐసీఏంఆర్ ఓ సర్వేను నిర్వహించగా అందులో అనేక విషయాలు బయటపడ్డాయి. 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉన్నారని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది.
ఇక ఇదిలా ఉంటే ప్రతిరోజు దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రజలను మోటివేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులను ప్రతి గంటకు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలని ప్రభుత్వం చెప్తున్నది. దేశంలో అందరికంటే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న రాష్ట్రం జమ్ము కాశ్మీర్ అని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది. ఆ రాష్ట్రంలోని 98 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 2 శాతం మందికి మాత్రమే యాంటీబాడిలు ఉన్నాయని సర్వేలో తేలింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు