ప్రభాస్ తో థర్డ్ వరల్డ్ వార్ కు సిద్దమైన నాగ్ అశ్విన్
- June 14, 2020
మహానటి సినిమాతో డైరక్టర్ నాగ్ అశ్విన్ కేపాసిటీ ఏంటో ఇండస్డ్రీకి క్లారిటీ వచ్చేసింది. అలాంటి సినిమా అందించాక కూడా అన్నాళ్లపాటు ఖాళీగా కూర్చుని, ఓ భారీ సినిమా స్క్రిప్ట్ తయారుచేసారు అంటే కచ్చితంగా ఏదో వుండే వుంటుంది అన్న ఆసక్తి పెరిగింది. ప్రభాస్ వన్ సిటింగ్ లో ఓకె చేసాడు అనగానే ఈ ఆసక్తి మరింత డబుల్ అయింది. అప్పటి నుంచీ ఈ కథలో విశేషాల మీద గ్యాసిప్ లు వినిపిస్తూనే వస్తున్నాయి.
సైన్స్ టచ్ వుంటుందని, కనిపించని అతీతశక్తి ప్రస్తావన వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లేటేస్ట్ సంగతి ఏమిటంటే, ఈ సినిమాలో థర్డ్ వరల్డ్ వార్ అన్నది కూడా ఓ కీ పాయింట్ గా వుంటుందన్నది. ఈ థర్డ్ వరల్డ్ వార్ సీన్ కోసం ఓ భారీ సెట్ ను కూడా హైదరాబాద్ లోనే రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ థర్డ్ వరల్డ్ వార్ కాన్సెప్ట్ వుండడంతో, సినిమాకు దాదాపు 400 కోట్ల మేరకు బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత అశ్వనీదత్.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







