చోటులేక వాటినే తవ్వి మళ్ళీ..బ్రెజిల్ దుస్థితి
- June 14, 2020
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలను కోల్పోయారు ప్రజలు. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే.. కోటికి దగ్గరలో ఉన్నాయి. ఇక కరోనా బాధితుల మరణాల్లో ఒక్కో దేశం నువ్వా నేనా అనేలా కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ బ్రెజిల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే బ్రెజిల్ కరోనా మృతుల్లో రెండవ స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా మృతులను ఖననం చేసేందుకు శ్మశానాల్లో కూడా చోటు లభించడం లేదు. దీంతో పాత సమాధులను తవ్వేసి కరోనా మృతుల శవాలను ఖననం చేస్తున్నారు. కాగా సావో పాలోలోని అతి పెద్ద శ్మశాన వాటికలో మూడేళ్ల కిందట కననం చేసిన మృత దేహాలను తీసేసి సమాధులను తవ్వేస్తున్నారు. ప్రస్తుతం బ్రేజిల్లో 8,50,796 కేసులు నమోదవ్వగా.. 42,791 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు