కరోనా పై సర్వే చెప్తున్న షాకింగ్ విషయాలు

- June 14, 2020 , by Maagulf
కరోనా పై సర్వే చెప్తున్న షాకింగ్ విషయాలు

కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. కరోనా వైరస్ ను తట్టుకొని నిలబడాలి అంటే తప్పనిసరిగా వ్యాధినిరోధక శక్తి కలిగి ఉండాలి. కరోనా వైరస్ దేశంలోని 82 జిల్లాల్లో వ్యాపించింది. ఈ 82 జిల్లాల్లో ఐసీఏంఆర్ ఓ సర్వేను నిర్వహించగా అందులో అనేక విషయాలు బయటపడ్డాయి. 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉన్నారని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది.

ఇక ఇదిలా ఉంటే ప్రతిరోజు దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రజలను మోటివేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులను ప్రతి గంటకు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలని ప్రభుత్వం చెప్తున్నది. దేశంలో అందరికంటే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న రాష్ట్రం జమ్ము కాశ్మీర్ అని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది. ఆ రాష్ట్రంలోని 98 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 2 శాతం మందికి మాత్రమే యాంటీబాడిలు ఉన్నాయని సర్వేలో తేలింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com