చోటులేక వాటినే తవ్వి మళ్ళీ..బ్రెజిల్ దుస్థితి

- June 14, 2020 , by Maagulf
చోటులేక వాటినే తవ్వి మళ్ళీ..బ్రెజిల్ దుస్థితి

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలను కోల్పోయారు ప్రజలు. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే.. కోటికి దగ్గరలో ఉన్నాయి. ఇక కరోనా బాధితుల మరణాల్లో ఒక్కో దేశం నువ్వా నేనా అనేలా కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ బ్రెజిల్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే బ్రెజిల్ కరోనా మృతుల్లో రెండవ స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా మృతులను ఖననం చేసేందుకు శ్మశానాల్లో కూడా చోటు లభించడం లేదు. దీంతో పాత సమాధులను తవ్వేసి కరోనా మృతుల శవాలను ఖననం చేస్తున్నారు. కాగా సావో పాలోలోని అతి పెద్ద శ్మశాన వాటికలో మూడేళ్ల కిందట కననం చేసిన మృత దేహాలను తీసేసి సమాధులను తవ్వేస్తున్నారు. ప్రస్తుతం బ్రేజిల్‌లో 8,50,796 కేసులు నమోదవ్వగా.. 42,791 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com