కువైట్: ఆఫీసుల కార్యాకలాపాల నిర్వహణకు మార్గనిర్దేశకాలు జారీ చేసిన సివిల్ సర్వీస్ కమిషన్
- June 16, 2020
కువైట్ సిటీ:కరోనా అలజడి తర్వాత తిరిగి సాధారణ పరిస్థితుల నెలకొల్పడంలో భాగంగా కువైట్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆఫీసుల నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలపటంతో కార్యకలాపాల విధి విధానాలపై సివిల్ సర్వీస్ కమిషన్ తగిన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఆఫీసులలో పని విధానాలను బట్టి వారికి అనుకూలంగా ప్రత్యేకంగా విధానాలు అవలంభించొచ్చని సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అయితే..ఆయా కార్యాలయాల్లో పాటించే విధానాలు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఉండాలని కూడా సూచించారు. వారం షెడ్యూల్ విధానాన్ని అవలంభించాలని, ఒక వారం కొందరు..మరో వారం మరికొందరు విధులకు హజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ పేర్కొంది. పని విధానాన్ని బట్టి వారం షెడ్యూల్ లో మినహాయింపులు ఉంటాయని కూడా వెల్లడించింది. అయితే..ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సూచించిన గరిష్ట సంఖ్యను దాటి ఏక కాలంలో ఉద్యోగులు విధులకు హజరుకావొద్దని కూడా సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?