కోవిడ్-19 ఎఫెక్ట్.. బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు
- June 17, 2020
ముంబై:ఇంకో అయిదేళ్ల కన్నా ప్రజలు డిజిటల్ టెక్నాలజీతో మమేకం కాక తప్పని పరిస్థితి. కానీ అనుకోకుండా మన జీవితాల్లోకి మన ప్రమేయం లేకుండా చొరబడిన కరోనా వైరస్ ఆ మార్పులేవో ఇప్పుడే చేయడానికి మార్గం సుగమం చేసింది. వైరస్ చాలా వేగంగా డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. దీంతో బ్యాంకింగ్ రంగంలో శాఖల విస్తరణకు బ్రేకులు పడ్డాయి. సరికొత్త రూపు రేఖలతో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఎక్కువ మంది బ్యాంకుకు రాకుండానే డిజిటల్ పద్దతిలో లావాదేవీలు సాగిస్తున్నారు. ఇక కాంటాక్ట్ లెస్ బ్యాంకింగ్ దిశగా అడుగులు ప్రారంభం అయ్యాయని ఓ బ్యాంక్ అధికారి అంటున్నారు.
బ్యాంకులు ఇప్పటికే ఇంటరాక్టివ్ టెల్లర్ మెషీన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ తో పాటు అవసరమైతే బ్యాంకర్లతో లైవ్ చాట్ కు వీలు కల్పించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకవేళ కొత్త శాఖలు ఏర్పాటు చేస్తే మ్యాన్ పవర్ తక్కువగా, సాంకేతికత ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని ఎస్బీఐ ఉన్నతాధికారి అంటున్నారు. అయితే గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల వినియోగదార్లకు శాఖల అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వినియోగదారులతో సంబంధాలు, శాఖల అవసరం ఉంటుందని అధికారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?