దోహా:వర్చువల్ స్పోర్ట్స్ నిర్వహణకు సిద్ధమైన ఖతార్ ఒలంపిక్ కమిటి
- June 17, 2020
దోహా:లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న వారి కోసం ఖతార్ ఒలంపిక్ కమిటీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నాలుగు వారాల పాటు వర్చువల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించబోతోంది. ఖతార్ ఒలంపిక్ కమిటి కు సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్ లో సైక్లింగ్, రన్నింగ్, ఆర్ట్స్, డ్రాయింగ్, యోగా లాంటి ఈవెంట్స్ చేపట్టనుంది. ఇందుకోసం సోషల్ మీడియా ద్వారా ప్రముఖ క్రీడాకారులతో చిన్నారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించనుంది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన వాళ్లు ఈ క్లాసుల ద్వారా ఫిట్ నెస్ పెంపొందించుకునేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంది కమిటి. ఇంటి వద్ద ఫిట్నెస్ కాపాడుకునేందుకు చేస్తున్న కసరత్తు వీడియోలను, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటిస్ వీడియోలను సంక్షిప్తంగా పంపించాలని కూడా కమిటి సూచించింది. వివిధ కేటగిరిలో 5, 10 కిలోమీటర్ల సైక్లింగ్, రన్నింగ్, డ్రాయింగ్, ఆర్ట్స్, యోగా పోటీలను నిర్వహించి..కాంపిటిషన్ లో గెలుపొందిన వారికి 30,000 డాలర్ల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. గృహనిర్బంధంలో ఉన్న వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా అయ్యేందుకు ఈ వర్చువల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు ఖతార్ ఒలంపిక్ కమిటి వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







