జగన్నాథుడి రథయాత్ర కు సుప్రీం నో
- June 18, 2020
న్యూఢిల్లీ: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో చారిత్రక జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ నెల 23 నుంచి జరుప తలపెట్టిన ఈ వేడుకలను కరోనా సంక్షోభం నేపథ్యంలో రద్దు చేయాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ప్రతి ఏటా సుమారు 10-12 రోజులపాటు సాగే పూరి జగన్నాథుడి రథయాత్రకు దేశ, విదేశాల నుంచి పది లక్షల మందికిపైగా భక్తులు తరలివస్తారు.
అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రథయాత్రను నిలిపివేయాలని కోరుతూ ఒడిశాకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డే, న్యాయమూర్తులు దినీష్ మహేశ్వరి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కరోనా సంక్షోభ సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు.. అని ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, పౌరుల రక్షణ దృష్ట్యా చారిత్రక జగన్నాథుడి రథ యాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని థర్మాసనం ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి వేడుకలు చేపట్టవద్దని, భక్తులను అనుమతించవద్దని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు