ఏ.పీ‌లో పెరిగిన కరోనా కేసులు

- June 18, 2020 , by Maagulf
ఏ.పీ‌లో పెరిగిన కరోనా కేసులు

అమరావతి:ఏ.పీ‌లో  24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. దీంతో.. మొత్తం కేసులు 7 వేల 496కి చేరాయి. ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఏపీకి చెందిన 299 మందిలోను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 100 మందికి కరోనా సోకినట్టు నిర్థారించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మరణాలు 92కి చేరాయి. తాజాగా మృతి చెందిన ఇద్దరు కూడా కృష్ణా జిల్లా వారే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు యాక్టివ్ కేసులు 2 వేల 779 ఉన్నాయి. 2 వేల 983 మంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com