మస్కట్:వేర్వేరు చోరీల కేసుల్లో ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
- June 18, 2020
ఒమన్ లో వేర్వేరుగా చోటుచేసుకున్న చోరీల కేసులలో ఆరుగురు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర అల్ బటినా గవర్నరేట్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఘటనలో మొబైల్ స్టోర్ నుంచి మొబైల్స్ దొంగించిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. ఈ ఇద్దరిపై చోరీతో పాటు మోసానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే దక్షిణ అల్ షార్కియా గవర్నరేట్ పరిధిలో పశువుల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జలన్ బని బు అలీ ప్రాంతంలో 11 పశువులను ముగ్గురు నిందితులు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?