మస్కట్:కేరళ వెళ్లే భారతీయులకు కోవిడ్ 19 టెస్టులు తప్పనిసరి

- June 18, 2020 , by Maagulf
మస్కట్:కేరళ వెళ్లే భారతీయులకు కోవిడ్ 19 టెస్టులు తప్పనిసరి

ఒమన్ నుంచి కేరళ వెళ్లే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా కోవిడ్ 19 టెస్టులు చేయించుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒమన్ లోని ప్రవాసభారతీయులను స్వదేశానికి తరలిచేందుకు జూన్ 20 నుంచి విమాన సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే..విదేశాల నుంచి కేరళ వస్తున్న ప్రవాసీయుల్లో దాదాపు 20 శాతం మందికి కరోనా బారిన పడిన వారేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా సోకిన వ్యక్తులతో విమాన ప్రయాణికుల్లోని మిగిలిన వారికి కూడా హై రిస్క్ పొంచి ఉండటంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వందే భారత్ మిషన్ లో భాగంగా నడుపుతున్న విమానాల్లోగానీ, చార్టెడ్ ఫ్లైట్స్ లో గానీ కేరళ వెళ్లే ప్రయాణికులు అంతా తప్పనిసరిగా కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్ ను బోర్డింగ్ సమయంలోనే తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కోవిడ్ 19 టెస్ట్ రిపోర్ట్స్ లేని వారిని ప్రయాణానికి అనుమతించరు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com