భారత్: ఆందోళనకరంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆరోగ్యం
- June 19, 2020
కరోనాతో బాధపడుతున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయన్ను మరో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలతో మూడు రోజుల క్రితం ఢిల్లిలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో చేరారు సత్యేందర్ జైన్. రెండు రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
మంగళవారం నిర్వహించిన ఫలితాల్లో నెగెలిట్ రాగా.. బుధవారం మరోసారి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మంత్రే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. సత్యేందర్ జైన్ పరిస్థితి మరింత క్షీణించిందని, అతన్ని రాజధానిలోని సాకేత్ మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ఫ్లాస్మా చికిత్సకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. సత్యేందర్ జైన్ అనారోగ్యంతో బాదపడుతుండడంతో ఆయన బాధ్యతలను డిప్యూటీ సీఎం సిసోడియాకు అప్పగించారు.
సత్యేందర్ జైన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కరోనాతో పోరాడుతున్న ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







