రూ.50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి పథకం..
- June 20, 2020
న్యూ ఢిల్లీ:లాక్డౌన్తో ఎన్నో కష్టాలు పడుతున్న వలస కార్మికుల కోసం కేంద్రం ప్రత్యేక ఉపాధి పథకాన్ని తీసుకొచ్చింది. రూ.50వేల కోట్లతో వలస కార్మికులకు స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించేందుకు గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదట బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సీఎం ప్రతినిధి పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. వలస కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. బీహార్లో అత్యధికంగా 32 జిల్లాల్లో గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన పథకం వర్తిస్తుంది. ఇక యూపీలో 31, మధ్యప్రదేశ్లో 24, రాజస్థాన్లో 22 జిల్లాలు ఉన్నాయి. పథకం ప్రారంభమైనందున అక్కడి వలస కార్మికులకు పని కల్పించనున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







