దోహా:ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు..నిబంధనలు పాటించని వారికి జరిమానా విధింపు

- June 20, 2020 , by Maagulf
దోహా:ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు..నిబంధనలు పాటించని వారికి జరిమానా విధింపు

దోహా:ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు..దేశంలో పలు ఆరోగ్య సేవా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం, కార్మికుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ కేంద్రాలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను, నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 65 ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో మూడు జనరల్ మెడికల్ కాంప్లెక్స్, 14 కంపెనీ క్లినిక్స్ లు, 48 ప్రాధమిక చికిత్స కేంద్రాలు ఉన్నాయి. అయితే..అధికారుల తనిఖీల్లో దాదాపు 81 ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని హెచ్చరించటంతో పాటు జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.  

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com