విజయవాడ నుండి నిజామాబాద్ కు బస్సు కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికుల విజ్ఞప్తి
- June 20, 2020
తెలంగాణ:32 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు ఈనెల 14న (14.06.2020) ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో బహ్రెయిన్ నుండి విజయవాడకు చేరుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ కార్మికులకు కూడా ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించడం విశేషం.వారం రోజుల సంస్థాగత క్వారంటైన్ గడువు ఈనెల 21తో ముగుస్తున్నందున స్వగ్రామాలకు వెళ్లేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. తమకు విజయవాడ నుండి నిజామాబాద్ వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని వీరందరూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారు ఉన్నందున విజయవాడ నుండి కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఆర్మూర్ ల మీదుగా నిజామాబాద్ వరకు బస్సు ఏర్పాటు చేయాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీఎంపీ కవిత లను కోరారు.

తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







