విజయవాడ నుండి నిజామాబాద్ కు బస్సు కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికుల విజ్ఞప్తి
- June 20, 2020
తెలంగాణ:32 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు ఈనెల 14న (14.06.2020) ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో బహ్రెయిన్ నుండి విజయవాడకు చేరుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ కార్మికులకు కూడా ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించడం విశేషం.వారం రోజుల సంస్థాగత క్వారంటైన్ గడువు ఈనెల 21తో ముగుస్తున్నందున స్వగ్రామాలకు వెళ్లేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. తమకు విజయవాడ నుండి నిజామాబాద్ వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని వీరందరూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారు ఉన్నందున విజయవాడ నుండి కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఆర్మూర్ ల మీదుగా నిజామాబాద్ వరకు బస్సు ఏర్పాటు చేయాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీఎంపీ కవిత లను కోరారు.

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







