తెలంగాణలో కొత్తగా 546 కరోనా కేసులు
- June 20, 2020
హైదరాబాద్:తెలంగాణలో శనివారం రికార్డు స్థాయిలో 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,072కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం కరోనాతో ఐదుగురు మరణించగా.. మొత్తం మృతులు సంఖ్య 203గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3,506 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,363 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
కొత్తగా వచ్చిన కేసుల్లో GHMC పరిధిలో 458 నమోదయ్యాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి 50, మెడ్చల్ 6, మహబూబ్నగర్ 3, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 1, జనగాంలో 10, ఖమ్మం 2, కరీంనగర్ 13, ఆదిలాబాద్లో ఒక కేసు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు