దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు
- June 21, 2020దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ కొంతమంది ఔత్సాహికులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ మిషన్ ఈ కార్యక్రమాన్ని తన సోషల్ మీడియా సైట్స్లో గంటసేపు ప్రత్యక్షప్రసారం చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్-19 విపత్కర పరిస్థితుల నుండి బయటకు రావడంలో యోగా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. యూఏఈలోని వివిధ కమ్యూనిటీస్ ఈ సారి యోగా కార్యక్రమాన్ని వర్చువల్గా జరపడానికి ముందుకు వచ్చినట్లు విపుల్ పేర్కొన్నారు. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి’ పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు వర్చువల్గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ