దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు
- June 21, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ కొంతమంది ఔత్సాహికులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ మిషన్ ఈ కార్యక్రమాన్ని తన సోషల్ మీడియా సైట్స్లో గంటసేపు ప్రత్యక్షప్రసారం చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్-19 విపత్కర పరిస్థితుల నుండి బయటకు రావడంలో యోగా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. యూఏఈలోని వివిధ కమ్యూనిటీస్ ఈ సారి యోగా కార్యక్రమాన్ని వర్చువల్గా జరపడానికి ముందుకు వచ్చినట్లు విపుల్ పేర్కొన్నారు. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి’ పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు వర్చువల్గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.

తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







