దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు
- June 21, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ కొంతమంది ఔత్సాహికులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ మిషన్ ఈ కార్యక్రమాన్ని తన సోషల్ మీడియా సైట్స్లో గంటసేపు ప్రత్యక్షప్రసారం చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్-19 విపత్కర పరిస్థితుల నుండి బయటకు రావడంలో యోగా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. యూఏఈలోని వివిధ కమ్యూనిటీస్ ఈ సారి యోగా కార్యక్రమాన్ని వర్చువల్గా జరపడానికి ముందుకు వచ్చినట్లు విపుల్ పేర్కొన్నారు. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి’ పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు వర్చువల్గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?